తెలుగుతేజం పీవీ సింధు వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ కైవసం చేసుకొని చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆమెకు పలువురు అభినందనలు తెలిపిన విషయం విధితమే. తాజాగా సింధుకు కర్ణాటక ప్రభుత్వం నుంచి అరుదైన ఆహ్వానం అందింది. మైసూరు దసరా ఉత్సవాల్లో పాల్గొనాలని ఆమెను ఆహ్వానించారు.
దసరా ఉత్సవాలకు ప్రత్యేక అతిథిగా రావాలంటూ ప్రముఖ షట్లర్ పీవీ సింధుకు అరుదైన ఆహ్వానం లభించింది. అక్టోబర్ 1న యువ దసరా-2019 కార్యక్రమం ప్రారంభం కానుంది. కర్ణాటక సీఎం యడ్యూరప్పతో కలిసి ఈ కార్యక్రమాన్ని సింధు ప్రారంభించనుంది.