ప్రముఖ టీవీ నటుడు, “బాహుబలి” ఫేం మధు ప్రకాశ్ భార్య ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. టీవీ నటుడు మధు ప్రకాష్, భారతి దంపతులు మణికొండ పంచవటి కాలనీలో నివాసముంటున్నారు. అయితే గతరాత్రి భారతి ఆత్మహత్యకు పాల్పడింది. భారతి బలవన్మరణానికి మధుప్రకాష్ వేధింపులే కారణమని ఆమె కుటుంబ సభ్యుల ఆరోపిస్తున్నారు. భారతి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. క్లూస్ టీమ్తో కలిసి ఘటనాస్థలిని పరిశీలించారు.
ఆమె నగరంలోని ఓ ప్రైవేటు సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. భర్తతోపాటు అత్తామామలు, మరిదితో కలిసి పంచవటి కాలనీలోని ఫ్లాట్లో నివసిస్తున్నారు. షూటింగ్ కోసం రోజూ ఉదయం బయటకు వెళ్లే మధుప్రకాష్ అర్ధరాత్రి సమయంలో ఇంటికి తిరిగి వస్తుంటారు. అయితే కొంత కాలంగా తన భర్త తనను పట్టించుకోవడం లేదని వాపోయిందట. మంగళవారం ఉదయం నిద్ర లేచిన మధుప్రకాష్ జిమ్కు వెళ్లి అక్కడి నుంచే షూటింగ్కు వెళ్లిపోయారు. తన భర్త తనకు దూరమైతున్నాడని ఆవేదనతో మనస్తాపానికి గురైన భారతి భర్తకు వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పారు. వీడియో కాల్ చూసిన మధు ప్రకాశ్ ఆందోళనతో వెంటనే ఇంటికి చేరుకున్నారని, ఎంతగా పిలిచిన ఆమె స్పందించకపోవడంతో మారుతాళంతో తలుపు తెరవగా భారతి ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. దీంతో.. షాక్ తిన్న మధు.. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాడు. భారతి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి పంపించి.. దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రాయదుర్గం పోలీసులు వచ్చి మృతదేహాన్ని ఉస్మానియా మార్చురికి కి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. కాగా మధుప్రకాష్ మాటీవీలో ప్రసారమయ్యే “కుంకుమ పువ్వు” సీరియల్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
రజినీకాంత్ ఆరోగ్యంపై కమల్ హాసన్ కామెంట్స్