దేశ వ్యాప్తంగా లోక్ సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రసంగాలు చేసి, అలసిపోయిన మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి వీరిద్దరు ఉడుపిలోని సాయిరాధా రిసార్టులో వీరిద్దరూ ఆయుర్వేద చికిత్సలు పొందుతున్నారు. పంచకర్మ చికిత్సలు చేయించుకుంటూ సాంత్వన పొందుతున్నారు.
యోగా, ధ్యానంలో నిమగ్నమయ్యారు. మీడియాను అనుమతించవద్దని కుమారస్వామి చెప్పడంతో అధికారులు అటువైపు ఎవరినీ అనుమతించడం లేదు. అంతేకాదు, జేడీఎస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దూరంగా ఉండాలని కోరారు. తాము పూర్తి విశ్రాంతిలో ఉన్నామని, పార్టీ నేతలతో కూడా కొన్ని రోజులు మాట్లాడబోనని కుమారస్వామి చెప్పినట్టు సమాచారం.