telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

న్యూఢిల్లీ : … అయోధ్య రివ్యూ పిటిషన్లపై .. సుప్రీంకోర్టులో విచారణ …

Supreme Court

నేడు అయోధ్య రివ్యూ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. సీజేఐ జస్టిస్‌ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం అంతర్గత విచారణ చేయనున్నది. రివ్యూ పిటిషన్లపై ఛాంబర్‌లో ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ జరపనున్నది . మాజీ సీజేఐ గొగొయ్‌ స్థానంలో ధర్మాసనంలోకి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వచ్చారు. విచారణను అంతర్గతంగా లేదా బహిర్గతంగా జరపడంపై నిర్ణయించే అవకాశం ఉంది. అయోధ్య కేసు తీర్పులో ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 18 రివ్యూ పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.

Related posts