telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

చంద్రబాబు కావాలనే రెచ్చగొడుతున్నాడు: మంత్రి అవంతి

avanthi srinivas minister ap

టీడీపీ అధినేత చంద్రబాబుపై ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు ముఠా అరాచకాలకు అంతే లేదని విమర్శించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మొదటగా చంద్రబాబు ఇంటి ముందు కవాతు నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు.

అమరావతి పేరుతో ఇతర జిల్లాలను విస్మరించింది చంద్రబాబేనని అన్నారు. అమరావతిని రాజధానిగా తొలగిస్తామని సీఎం జగన్ ఎప్పుడూ చెప్పలేదని, రాజధాని తరలింపు రహస్యంగా జరిగే ప్రక్రియ కాదని స్పష్టం చేశారు. రాజధాని రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు.ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టేలా కొన్ని పార్టీలు మాట్లాడుతున్నాయని దుయ్యబట్టారు.

Related posts