telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

బోయిన్ పల్లి కిడ్నాప్ కేసులో A1 ఏవీ సుబ్బారెడ్డి అరెస్ట్…

av subbareddy akhilapriya

హైదరాబాద్‌లోని బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే కేసులో ఏవీ సుబ్బారెడ్డి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ఏవీ సుబ్బారెడ్డిగా పోలీసులు గుర్తించారు. బాధితుల వాగ్మూలం ప్రకారం ఈ కేసులో A1 గా ఏవీ సుబ్భా రెడ్డి ఉన్నారు. అయితే తాజాగా సుబ్భారెడ్డిను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేసారు. అయితే తన అరెస్ట్ కు ముందు సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. నన్ను ఎందుకు A1 గా చేర్చారో తెలియదు. నాకు ఈ కేసుకు సంబంధం లేదు. ప్రవీణ్ రావు తో విబేధాలు ఉన్నది వాస్తవమే. అయితే హఫీజ్ పేట్ భూమి వివాదం గురించి ఇప్పుడు మాట్లాడలేను. భూమా అఖిల ప్రియ నన్ను చంపడనికి సుపారి ఇచ్చిందని గతంలో కేసు పెట్టాను. అలాంటిది వారితో కలిసి నేనెందుకు కిడ్నప్ చేస్తాను అని అన్నారు. అయితే ఈ కేసులో టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియను  అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.  ఈ కేసులో కీలక నిందితులుగా చెప్తున్న భార్గవ్, చంద్రహాస్ లు పరారీలో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు. కిడ్నాప్ కేసులో చంద్రహాస్ పాత్ర ఏ మేరకు ఉన్నది అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు.  ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ చేసిన మాజీ మంత్రి భూమా అఖిల ప్రియను వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.  వైద్యపరీక్షల ఆమెను సికింద్రాబాద్ లోని కోర్టులో హాజరుపరచనున్నారు. 

Related posts