ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం పాలైంది. అడిలైడ్ ఓవల్లో జరిగిన ఈ డే/నైట్ టెస్టులో ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో పాకిస్థాన్ పై ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో మూడు వికెట్ల నష్టానికి 589 పరుగులు చేసింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ అజేయ ట్రిపుల్ సెంచరీ (335)తో ఆకాశమే హద్దుగా చెలరేగగా, మార్నస్ లబుషేన్ (162) సెంచరీతో కదం తొక్కాడు. దీంతో ఆసీస్ 589/3 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ తొలి ఇన్నింగ్స్లో 302 పరుగులకే ఆలౌట్ అయింది.
అప్పటికే ఆస్ట్రేలియా స్కోర్ భారీ ఆధిక్యం ఉండడంతో పాకిస్థాన్తో ఆసీస్ ఫాలో ఆన్ ఆడించింది. అయితే, రెండో ఇన్నింగ్స్లో పాక్ బ్యాట్స్మెన్ క్రీజులో కుదురుకోలేక వికెట్లు సమర్పించుకున్నారు. షాన్ మసూద్ (68), అసద్ షఫిఖ్ (57), మొహ్మద్ రిజ్వాన్ (45) మాత్రమే పరవాలేదనిపించారు. మిగతా వారిలో ఎవరూ పట్టుమని పది పరుగులు కూడా చేయలేకపోయారు. దీంతో పాక్ ఇన్నింగ్స్ 239 పరుగుల వద్ద ముగిసింది. ఫలితంగా ఆసీస్ ఇన్నింగ్స్ 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, రెండు టెస్టుల సిరీస్ను కైవసం చేసుకుంది.