ప్రకాశం జిల్లాలోని ఒంగోలులో 16 ఏళ్ల బాలికపై ఆరుగురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. యువకుల నుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారం రోజులుగా బంధించి అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక వాపోతుంది. ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు.
ఒంగోలు రిమ్స్లో చికిత్స పొందుతున్న బాలికను మంత్రి బాలినేని పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ఆండగా ఉంటుందన్నారు. నిందితుల్లో ముగ్గురు మైనర్లు ఉన్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులతో పాటు శక్తి టీమ్స్ను కూడా అలెర్ట్ చేసి నిందితులను పట్టుకున్నారు.