telugu navyamedia
ఆంధ్ర వార్తలు క్రైమ్ వార్తలు వార్తలు

అర్ధరాత్రి బస్సుపై ఆకతాయిల దాడి

బెజవాడలో శనివారం అర్ధరాత్రి అల్లరి మూకలు బీభత్సం సృష్టించారు. తాము వెళ్తున్న బైక్‌కు సైడ్ ఇవ్వలేదనే కోపంతో ఆర్టీసీ బస్సును యువకులు ఆపి డ్రైవర్‌‌ను చితకబాదారు. అనంతరం బస్సులో చొరబడి డాడి చేసి 25 వేలు తీసుకెళ్లారు. యువకుల బీభత్సంతో భయబ్రాంతులకు గురైన ప్రయాణికులు వాళ్లను అడ్డుకోలేకపోయారు. మొత్తం 20 మంది యువకులు ఈ ఘటనలో పాల్గొన్నట్లు తెలుస్తోంది. మరోవైపు బస్సు ముందుభాగంలోని అద్దాలను సైతం ధ్వంసం చేశారు. డ్రైవర్ బస్సుతో ఢీ కొట్టడం వల్లే తాము దాడి చేశామని యువకులు వివరణ ఇచ్చారు. పోలీసులు ఇరు వర్గాలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఆదివారం సాయంత్రం పోలీసులు పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వనున్నారు.

Related posts