ఈఎస్ఐ స్కాంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును ఏసీబీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, పైల్స్ కారణంగా ఆయన గుంటూరు జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇప్పటికే ఓసారి శస్త్రచికిత్స చేయించుకున్నారు.అయితే, ఆపరేషన్ జరిగిన తర్వాత ఏసీబీ ఆయన్ను అరెస్ట్ చేసి రోడ్డుమార్గంలో విజయవాడకు తరలించడంతో విశ్రాంతి తీసుకునే అవకాశం లేకపోయింది.
దీంతో తొలిసారి చేసిన ఆపరేషన్ పూర్తిస్థాయిలో సఫలం కాకపోవడంతో తాజాగా మరోసారి ఆపరేషన్ చేశారు. ఉన్నతాధికారుల అనుమతి తీసుకున్న గుంటూరు జీజీహెచ్ వైద్యులు ఈ మధ్యాహ్నం అచ్చెన్నాయుడుకు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉన్నట్టు తెలుస్తోంది.