టీమిండియా బౌలర్లు దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజు ఉదయం శుభారంభం చేశారు. మ్యాచ్ ప్రారంభమైన రెండో ఓవర్లోనే రవిచంద్రన్ అశ్విన్ డిబ్రుయిన్(10)ను బౌల్డ్ చేయగా తర్వాతి ఓవర్లో మహ్మద్ షమి.. తెంబ బువుమా(0)ను బౌల్డ్ చేశాడు. బవుమా ఎదుర్కొన్న రెండో బంతికే డకౌట్ కావడంతో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్లో 12 ఓవర్లకు 20 పరుగులు చేసి మూడు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం మార్క్రమ్, డుప్లెసిస్ క్రీజులో ఉన్నారు.
రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో అత్యంత వేగంగా 350 వికెట్లు తీసి చరిత్ర సృష్టించాడు. ఇదివరకు శ్రీలంక బౌలర్ ముత్తయ్య మురళీధరన్ 66 టెస్టుల్లో ఈ ఘనత సాధించగా అశ్విన్కి కూడా ఇది 66వ మ్యాచ్ కావడం విశేషం. ఈ నేపథ్యంలో టీమిండియా గెలవడానికి ఇంకా ఏడు వికెట్ల దూరంలో ఉంది.
నాకు ఇష్టం లేకపోయినా బెడ్ సీన్ లో నటించా : రాశి ఖన్నా