రేపు కేసీఆర్ తో ఆర్టీసీ కార్మికుల సమావేశంలో 26 డిమాండ్లపై చర్చించి కార్మికులను ఆదుకోవాలని ఆర్టీసీ ఐకాస ఛైర్మన్ అశ్వత్థామరెడ్డి కోరారు. హైదరాబాద్ ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో ఆర్టీసీ జేఏసీ… విపక్ష పార్టీల నేతలతో సమావేశమైంది. ఈ సమావేశానికి అశ్వత్థామరెడ్డితో పాటు కో-కన్వీనర్ రాజిరెడ్డి, తెదేపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, తెజస అధ్యక్షుడు కోదండరామ్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తదితరులు హాజరయ్యారు.
సమావేశం ముగిసిన తర్వాత అశ్వత్థామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ… డిపోల్లో అమాయకులను సీఎం సమావేశానికి పంపిస్తు్న్నారని ఆక్షేపించారు. అధికారులతో కాకుండా ప్రశాంత వాతావరణంలో ఆర్టీసీ కార్మికులతో సీఎం సమావేశం నిర్వహించాలని కోరారు. సెక్షన్ 19 ప్రకారం ఎవరైనా ట్రేడ్ యూనియన్ పెట్టుకోవచ్చని, రాజ్యాంగం ప్రకారం కార్మిక సంఘాలు నడుస్తున్నాయని వెల్లడించారు. ఆర్టీసీ యాజమాన్యం కోర్టు నిబంధనల ప్రకారం నడుచుకోవాలన్నారు. ఇటీవల మరణించిన ముగ్గురు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పొన్నాల ఫౌండేషన్ నుంచి ఆర్థిక సాయం అందిస్తున్నారని తెలిపారు. వివిధ సంఘాలు, బ్యాంకు అధికారులు ఆర్టీసీ కార్మికుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేశారని వివరించారు. సమ్మెకు సహకరించిన రాజకీయ, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాలకు అశ్వత్థామరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
బడ్జెట్ ప్రసంగంలో కేంద్రం పై కేసీఆర్ తీవ్ర వ్యాఖ్యలు