telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అసైన్డ్ భూముల కొనుగోలుపై.. మాజీ మంత్రులపై కేసు!

అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో మాజీమంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, బెల్లంకొండ నరసింహారావులపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఐపీసీ 420, 506, 120 బీ సెక్షన్లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసులు నమోదైనట్లు తెలిసింది. అయితే ఈ కేసులపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

తమ భూములను బెదిరించి లాక్కున్నారంటూ రాష్ట్ర మాజీ మంత్రులపై ఫిర్యాదులు వచ్చాయి. వెంకట పాలేనికి చెందిన పోతురాజు బుజ్జమ్మ అనే వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు సీఐడీ చర్యలుచేపట్టింది. తనకు చెందిన 99 సెంట్ల అసైన్డ్ భూమిని టీడీపీ నేతలు కొన్నారని బుజ్జమ్మ ఆరోపణలు చేసింది. ఈ క్రమంలో మాజీ మంత్రులపై సీఐడీ కేసు నమోదు చేసింది.

Related posts