telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

భ్రమలో ఉంటే కుదరదు టీడీపీ ఓటమి పై ..అశోక్ గజపతిరాజు హెచ్చరిక

Ashoka Gajapati gives clarity Chandrababu

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు స్పందించారు. ఈరోజు విజయనగరం జిల్లాలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలుతో పాటు ప్రజంటేషన్ కూడా ముఖ్యమేనని తెలిపారు. అయితే ఈ రెండింటి మధ్య గ్యాప్ వచ్చిందనీ, అందువల్లే టీడీపీ ఓడిపోయిందని విశ్లేషించారు. టీడీపీ ఓడిపోయింది కాబట్టే కొందరు నేతలు పార్టీని వీడుతున్నారని ఆయన స్పష్టం చేశారు.

క్షేత్రస్థాయి నుంచి నూతన నాయకత్వాన్ని తయారుచేసుకోవాల్సిన అవసరం ఉందని అబిప్రాయపడ్డారు. ఇప్పటికీ టీడీపీ బలంగానే ఉందనీ, తప్పులు తెలుసుకుని పార్టీని బలోపేతం చేయడంపై చంద్రబాబు దృష్టి సారించాలని సూచించారు. అలా కాకుండా ఇంకా ఏదో భ్రమలో ఉండిపోతే నాయకత్వం నిలబడదు అని హెచ్చరించారు.

Related posts