telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ

బీజేపీ గాడ్సే రచ్చ : స్పందించిన .. ఒవైసీ అసదుద్దీన్ ..

oyc president on congress-tdp alliance

ఎన్నికల సమయంలో కాస్త నోరు అదుపులో పెట్టుకొని విమర్శనాస్త్రాలు వేయాల్సి ఉంటుంది. పొరపాటున తేడా వస్తే, అదే బ్రహ్మాస్త్రంగా మారిపోతుంది పోటీదారులు. అదే జరిగింది బీజేపీ విషయంలో.. ఇటీవల మహాత్మాగాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే గొప్ప దేశభక్తుడని, ఆయన ఎప్పటికీ దేశభక్తుడిగానే మిగిలిపోతారన్న బీజేపీ నాయకురాలు సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. గాడ్సేకు బీజేపీ భారతరత్న కూడా ఇస్తుందంటూ దుయ్యబట్టారు.

బీజేపీ భోపాల్ ఎంపీ అభ్యర్థిగా సాధ్వి అభ్యర్థిత్వాన్ని వెనకేసుకొచ్చింది ప్రధాని మోదీనే అనే విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ఒవైసీ అన్నారు. గాడ్సేపై సాధ్వి వ్యాఖ్యలు ముమ్మాటికీ ఆమె వ్యక్తిగతం కాదని చెప్పారు. స్వతంత్ర భారతావనిలో తొలి టెర్రరిస్టు ఎవరనే ప్రశ్నకు బీజేపీ సమాధానం ఇదని అన్నారు. రానున్న కొన్నేళ్లలో శ్రీశ్రీ గాడ్సేకు భారతరత్న ఇవ్వాలనే ప్రతిపాదనను బీజేపీ తెరపైకి తెస్తుందని జోస్యం చెప్పారు.

Related posts