telugu navyamedia
రాజకీయ వార్తలు

వారిపై చర్యలెందుకు తీసుకోలేదు..మోదీ పై అసదుద్దీన్ ఒవైసీ ఫైర్

MIM Comments MP Elections

ప్రధాని నరేంద్ర మోదీపై మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. దేశంలో ముస్లింలు భయపడుతున్నారని మోదీ చెప్పడంపై ఆయన ఘాటుగా స్పందించారు. యూపీలో అఖ్లాక్ ను కొట్టిచంపిన అల్లరిమూకపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. మోదీకి నిజంగా ముస్లింలపై ప్రేమ ఉంటే ఎంతమందికి లోక్ సభ టికెట్లు ఇచ్చారని నిలదీశారు. ముస్లింలు భయపడుతున్నారని మోదీ అంటున్నారని మండిపడ్డారు.

మరి గోవు పేరుతో హత్యలు చేయడాన్ని మోదీ ఎందుకు నివారించడం లేదని ప్రశ్నించారు. ముస్లింలు కొడుతూ వీడియోలు తీసి వేధిస్తున్న వారిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని నిలదీశారు. ముస్లింలపై మోదీ ప్రేమ చూపిస్తున్నారు. మరి బీజేపీ గెలిచిన 300 మంది ఎంపీల్లో ముస్లింలు ఎంత మంది ఉన్నారో చెప్పండని ప్రశ్నించారు.

Related posts