telugu navyamedia
రాజకీయ వార్తలు

ఆహ్వానితుల జాబితా నుంచి కేజ్రీవాల్ పేరు తొలగింపు!

kejriwal on his campaign in ap

భారత పర్యటనలో భాగంగా అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించనుంది. ఈ కార్యక్రమానికి ఆహ్వానించకుండా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాకు కేంద్ర ప్రభుత్వం షాకిచ్చింది. కావాలనే ఈ ఇద్దరినీ దూరం పెట్టిందని ఆమ్ ఆద్మీ పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

భారత పర్యటనలో భాగంగా మెలానియా మంగళవారం దక్షిణ ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలకు వచ్చి అక్కడ జరిగే ‘హ్యాపీనెస్ క్లాస్’ను చూడనున్నారు. అలాగే, ఓ గంట పాటు పాఠశాల చిన్నారులతో అమెరికా ప్రథమ మహిళ మాట్లాడనున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం మెలానియాకు ఢిల్లీ సీఎం, డిప్యూటీ సీఎం ఆహ్వానం పలకాల్సి ఉంది. అయితే, ఈ వీవీఐపీ ఈవెంట్ ఆహ్వానితుల జాబితా నుంచి కేజ్రీవాల్ , మనీశ్ పేర్లను కేంద్ర ప్రభుత్వం కావాలనే తొలగించిందని ఆప్ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

Related posts