అరుణాచల్ ప్రదేశ్లో తీవ్రవాదులు రెచ్చిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు మరో పది మందిని తీవ్రవాదులు హతమార్చారు. ఈ విషాద సంఘటన తిరాప్ జిల్లా బోగపని గ్రామంలో చోటుచేసుకుంది. కోన్సా పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే, నేషనల్ పీపుల్స్ పార్టీ నాయకుడు టిరాంగ్ అబోని తీవ్రవాదులు ఈ రోజు కాల్చి చంపారు. నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్కు చెందిన తీవ్రవాదులే ఈ హత్యకు పాల్పడ్డట్లుగా సమాచారం. చనిపోయిన పది మందిలో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు సైతం ఉన్నారు. దాడిని మేఘాలయ సీఎం తీవ్రంగా ఖండించారు.