“గుణ 369” దర్శకుడితో మరోసారి కార్తికేయ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో యంగ్ హీరో కార్తికేయ నటించిన తాజా చిత్రం “గుణ 369”. ఆగస్ట్ 2న విడుదలైన ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఈ చిత్రంలో కార్తికేయ సరసన అనఘ కథానాయికగా నటిచింది. ఈ చిత్రాన్ని తిరుమల రెడ్డి, అనీల్ కడియాలా సంయుక్తంగా నిర్మించారు. చింతన్ భరద్వాజ్ చిత్రానికి సంగీతం అందించారు. రామ్ రెడ్డి సినిమాటోగ్రాఫర్గా పని చేస్తున్నారు. రస్టిక్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తుంది. విమర్శకుల ప్రశంసలు కూడా ఈ చిత్రానికి లభిస్తున్నాయి.ఈ మూవీ మంచి విజయం సాధించినందుకు కార్తికేయ ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. ఈ క్రమంలో “గుణ 369” చిత్ర డైరెక్టర్తో మరో చిత్రం చేసేందుకు కార్తికేయ సిద్దమయ్యాడు. ఈ ఏడాదే ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందట. త్వరలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నట్టు తెలుస్తుంది.
previous post