సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె.నాయుడు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడంటూ నటి శ్రీసుధ అలియాస్ సాయిసుధ పోలీస్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. శ్రీసుధ ఇటీవల ఎస్ఆర్ నగర్ పోలీసు ఇన్స్పెక్టర్ మురళీ కృష్ణపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు కోసం మురళీ కృష్ణ తన నుంచి డబ్బులు వసూలు చేశాడని ఆమె ఆరోపించారు. ఈ కేసులో శ్యామ్ కె.నాయుడును అరెస్టు చేయకపోవడంతోపాటు కోర్టులో రాజీ కుదుర్చుకున్నట్లు నకిలీ లెటర్ సృష్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐతో మాట్లాడిన సాక్షాలను కూడా ఆమె ఏసీబీకి అందజేశారు. ఈ కేసులో అధికారులు మధ్యవర్తులను విచారిస్తున్నారు. బాపూనగర్లో ఉండే రాజేష్ నుంచి సెల్ఫోన్ను స్వాధీనం చేసుకొని అతడిని విచారించారు. ఈ కేసులో మరో మధ్యవర్తిని కూడా విచారించనున్నారు.