జమ్మూకశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేయడంతో దేశమంతా ఆనందంగా ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. చండీగఢ్ లోని పంజాబ్ యూనివర్శిటీలో జరిగిన బలరామ్ జీ దాస్ టాండన్ తొలి స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడుతూ దేశ సమగ్రతను కాపాడుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కొన్ని విదేశీ మీడియా సంస్థలు 370 రద్దు పై తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
జమ్మూకశ్మీర్ కు ప్రత్యేక హక్కులు, స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న ఆర్టికల్ 370 అన్నది తాత్కాలిక నిబంధన మాత్రమేనని వెంకయ్య స్పష్టం చేశారు. స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోనున్న తరుణంలో కులం, లింగ వివక్ష వంటి సామాజిక రుగ్మతలను దేశం నుంచి తరిమికొట్టడానికి అందరూ కంకణ బద్ధులు కావాలని పిలుపునిచ్చారు.