telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణ : .. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరన … ప్రభుత్వంతో చర్చలు సఫలం..

arogyasri services continues in telangana

ప్రభుత్వం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించేందుకు నెట్‌వర్క్‌ ఆస్పత్రుల యాజమాన్యాలతో జరిపిన చర్చలు సఫలమయ్యాయి. సచివాలయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆయా ఆస్పత్రుల ప్రతినిధులతో మరో దఫా చర్చలు జరిపారు. నెట్‌వర్క్‌ ఆస్పత్రుల ప్రతినిధులు చేసిన డిమాండ్లకు ప్రభుత్వ సానుకూలంగా స్పందించడంతో చర్చలు సఫలమయ్యాయి.

దీనితో సమ్మెను విరమిస్తున్నట్లు ఆస్పత్రి యాజమాన్యాలు ప్రకటించాయి. సమ్మె విరమించడంతో ఈ రోజు నుండే ఆరోగ్యశ్రీ సేవలు యథాతథంగా కొనసాగనున్నాయి.

Related posts