ఆర్మీ ఉద్యోగాల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపారు.జిల్లా కేంద్రంలో అక్టోబర్ 7 నుంచి 17 వరకు ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఆర్మీ రిక్రూట్మెంట్ బోర్డు డైరెక్టర్ కల్నల్ పవన్పురితో కలిసి మీడియాతో మాట్లాడారు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన యువతీ యువకులు ర్యాలీలో పాల్గొనవచ్చన్నారు. ఈ నెల 23 నుంచి సెప్టెంబర్ 22 వరకు www.joinindianarmy.nic.in వెబ్ సైట్ లో పేర్లు నమోదు చేసుకుని దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆర్మీలో తెలంగాణ జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో ఉన్నారని జిల్లాల వారిగా అవగాహన పెంపొందించేందుకే ఒక్కో సంవత్సరం ఒక్కో జిల్లాలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.