telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఎల్.ఓ.సి వద్ద పరిస్థితి సమీక్షించిన .. ఆర్మీ చీఫ్ రావత్ …

army chief ravath checking in LOC

జమ్మూకశ్మీర్ పై భారత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పాక్ గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. దీనితో విచక్షణ మరిచిన ఆ దేశ ఆర్మీనే తీవ్రవాదులుగా భారత్ పై దాడులకు విరుచుకుపడేందుకు దొంగదెబ్బ తీసేందుకు సమాయత్తం అవుతున్నారు. నేడు భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో నియంత్రణ రేఖ వద్ద తాజా పరిస్థితిని, బలగాల సన్నద్ధతను ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ స్వయంగా సమీక్షించారు.

నార్తరన్ కమాండ్ ఆర్మీ ఉన్నతాధికారులతో కలిసి ఎల్‌ఓసీ వెంబడి విధి నిర్వహణలో ఉన్న వైట్ నైట్ కాప్స్‌ను రావత్ కలుసుకున్నారు. భద్రతా పరిస్థితి, బలగాల సన్నద్ధతను సమీక్షించారు. ఈ సందర్భంగా బలగాల అప్రమత్తత, ధైర్యసాహసాలను ఆయన కొనియాడారు. రెండు రోజుల పర్యటన కోసం రావత్ ఇవాళ శ్రీనగర్ వచ్చారు.

Related posts