సోషల్ మీడియాలో పరిచయమైన మహిళతో సహజీవనం చేసిన సయమంలో ఆమె అసభ్యకర ఫొటోలను తీసుకున్నాడు నిందితుడు. అనంతరం వాటిని అడ్డుపెట్టుకొని ఆమెను బెదిరించిడం మొదలెట్టాడు. తాను అడిగినంత ఇవ్వకపోతే ఆ ఫొటోలను సోషల్ మీడియాలో పెడతానని పలుమార్లు బెదిరించి ఏకంగా రూ. కోటి 30 లక్షల వరకు తీసుకున్నాడు. ఆ తరువాత కూడా ఆమెను వదిలిపెట్టలేదు. మళ్లీ డబ్బులు కావాలని బెదిరిస్తుండడంలో బాధితురాలు చేసేదేమి లేక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిందితుడిని అబుదాబి న్యాయస్థానంలో హాజరుపరిచారు. కోర్టులో తన నేరాన్ని అంగీకరించడంతో నిందితుడికి భారీ జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. సహజీవనం చేసినప్పటి ఫొటోలను వాడుకొని మహిళను బ్లాక్మెయిల్ చేసి భారీగా వసూలు చేసిన ఈ అరబ్ వ్యక్తికి అబుదాబి కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.94లక్షలు జరిమానా విధించింది.
previous post
next post
టూరిజం బోట్లలో మంత్రులకు వాటాలు: మాజీ ఎంపీ హర్షకుమార్