వెండితెరకి హీరోల వారసులు, హీరోయిన్ల ఫ్యామిలీ నుంచి నటీనటులు పరిచయం కావడం సాధారణమే. తాజాగా తమిళ హీరో, సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ సోదరి, ఏఆర్ రెహామాన్ మేనకోడలు భవానీ శ్రీ వెండితెరకి పరిచయం కానుంది. దర్శకుడు విరుమాండి తమిళంలో విజయ్ సేతుపతి హీరోగా క పై రనసింగం అనే టైటిల్తో ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా ఐశ్వర్య రాజేశ్, మరో హీరోయిన్ గా భవానీశ్రీని ఎంపిక చేసుకున్నారు. భవానీ గతంలో అక్కినేని అమల నటించిన వెబ్ సిరీస్లో నటించింది. “మెసేజ్ ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందుతున్న “క పై రనసింగం”లో విజయ్ సేతుపతి, ఐశ్వర్య రాజేష్తో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను. వారి నుండి చాలా నేర్చుకోవాలి అనుకుంటున్నాను” అని భవానీ తెలిపింది. త్వరలోనే ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది.
previous post