telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏసీ బస్సుల కొనుగోలుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం!

apsrtc bus

కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు ఏపీఎస్ ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ నెలలోనే 698 ఉన్నతాధికారులు నిర్ణయించారు. వీటిలో 18 మల్టీ యాక్సిల్‌ వోల్వో, 50 ఇంద్ర, 630 నాన్‌ ఏసీ బస్సులు కొనాలని ప్రతిపాదించారు. మరోవైపు కాలం చెల్లిన బస్సులను దశల వారీగా మార్చడంతో పాటు అధ్వానంగా ఉన్న బస్సులను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. అధ్వానంగా ఉన్న బస్‌ల బాడీ యూనిట్లు మార్చేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. ఇందుకు సంబంధించి డిపోల వారీగా వివరాలు సేకరిస్తున్నారు. సౌకర్యాలను మరింత మెరుగుపర్చటం ద్వారా ఆక్యుపెన్సీ శాతాన్ని 90కు పైగా పెంచుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది.

ఆర్టీసీకి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. బడ్జెట్లో రూ.1,572 కోట్లు కేటాయించింది. ఆ తర్వాత రూ.వెయ్యి కోట్లను గ్యారంటీ రుణం కింద అందించింది. ఈ నిధుల్లో రూ.225 కోట్లను కొత్త బస్సుల కొనుగోలుకు ఆర్టీసీ కేటాయించింది. ప్రస్తుతం ఆర్టీసీలో 27 వెన్నెల స్లీపర్, 68 అమరావతి బస్సులు ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి.

Related posts