కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సులో టికెట్ల కొనుగోలుకు స్వస్తి చెబుతూ మొత్తం ఆన్లైన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అన్ని రకాల బస్సు సర్వీసులకు టికెట్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే వెసులుబాటును కల్పిస్తూ సరికొత్త యాప్ను రూపొందించింది. తొలుత విశాఖపట్నం, విజయవాడ సిటీల పరిధిలోని బస్సుల్లో ఈ యాప్ ద్వారా టికెట్లను జారీ చేయాలని భావించింది. ఇప్పుడు పల్లె వెలుగు సహా అన్ని బస్సులకూ ఈ యాప్నే వాడాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వచ్చే నెలలో ఈ యాప్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. ప్రయాణికుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాలనేది యాప్లో నమోదు చేస్తే ఏయే బస్సులు ఏ సమయంలో అందుబాటులో ఉన్నాయనేది యాప్ చూపిస్తుంది. అలా బస్సును ఎంపిక చేసుకుని టికెట్ కొనుగోలు చేయవచ్చు. నగదు చెల్లింపులు కూడా ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుంది.
ఏపీలో కొత్త పార్టీ ఏర్పాటుపై బ్రదర్ అనిల్ హాట్ కామెంట్స్