telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు వ్యాపార వార్తలు

విజయవాడ స్లీపర్‌ బస్సు చార్జీల్లో రాయితీ

Apsrtc offer for sleeper buses

విజయవాడ నుంచి బెంగళూరు వెళ్ళే ప్రయాణీకులకు ఆర్టీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. బెంగళూరు – విజయవాడల మధ్య ప్రవేశపెట్టిన ఏపీఎస్‌ఆర్టీసీ ఏసీ సీప్లర్‌ బస్సులో శుక్రవారం మినహా మిగిలిన అన్ని రోజులలో చార్జీలపై 22శాతం రాయితీని ప్రకటించారు. ఈ విషయాన్ని అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ ఎస్‌.వి.ప్రభాకర్‌ శనివారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు.

రాయితీ శనివారం నుంచి అమలులోకి వచ్చిందన్నారు. ఈ బస్సులో చార్జీ ఒక్కొక్కరికి రూ.1970 కాగా 22శాతం రాయితీ అనంతరం చార్జీ రూ.1515 గా ఉంటుందన్నారు. నెల ముందుగా టికెట్‌లు రిజర్వు చేసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వివరాలకు 99455 16545కు సంప్రదించాలని ప్రకటనలో కోరారు.

Related posts