ఈరోజు ఏపీఎస్ ఆర్టీసీ జేఏసీ నేతలు ఏపీసీఎం వైఎస్ జగన్ ను కలుసుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించాలనీ, లేదంటే సమ్మెకు వెళ్లడం తప్ప తమకు మరో గత్యంతరం లేదని స్పష్టం చేశారు. ఈ విషయమై సీఎం జగన్ స్పందిస్తూ… ఆర్టీసీని ప్రభుత్వంంలో విలీనం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులు పొందే సౌకర్యాలన్నీ కల్పిస్తామని స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు, సిబ్బందికి సంబంధించిన న్యాయపరమైన అన్ని డిమాండ్లను నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. సీఎం నిర్ణయంతో సంతృప్తి చెందిన ఆర్టీసీ జేఏసీ రేపటి నుంచి చేపట్టాల్సిన నిరవధిక సమ్మె నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. విలీన ప్రక్రియ పూర్తి కావడానికి మూడు నెలలు పడుతుందని సీఎం చెప్పారన్నారు.