telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు విద్యా వార్తలు సామాజిక

ఈ నెల 23న ఏపీఆర్‌వో పోస్టులకు ఇంటర్వ్యూలు

AP

సమాచార, పౌర సంబంధాల శాఖలో పోస్టుల భర్తీ కోసం ఏపీ ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్‌లో రాత పరీక్షలు నిర్వహించింది. అసిస్టెంట్‌ పబ్లిక్‌ రిలేషన్స్‌ ఆఫీసర్‌ (ఏపీఆర్‌వో) పోస్టుల కోసం ఏప్రిల్‌ 29-30 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.

మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఈ నెల 23న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తెలిపింది. ఆయా అభ్యర్థులు వెరిఫికేషన్‌ కోసం ఒరిజినల్‌ సర్టిఫికెట్లు తమతో తీసుకురావాలని సూచించింది. 23న ఉదయం 8 గంటల నుంచి 9 మందికి, 11 గంటల నుంచి 9 మంది అభ్యర్థులకు ఇంటర్వ్యూలు జరుగుతాయని తెలిపింది.

Related posts