telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

ఈ నెల 14వ తేదీని జాతీయ సెలవుగా ప్రకటించిన కేంద్రం

National holiday

కరోనాను కట్టడి చేసేందుకు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న లాక్ డౌన్ ఈనెల 14న ముగుస్తోందో లేదో ఇంతవరకు తెలియని పరిస్తితి నెలకొంది. అయితే లాక్ డౌన్ ను అంతటితో ముగిస్తారా? లేదా కొనసాగిస్తారా? అనే విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.

మరోవైపు 14వ తేదీని జాతీయ సెలవుగా కేంద్రం ప్రకటించింది. రాజ్యంగ రూపకర్త అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆరోజును జాతీయ సెలవు దినంగా ప్రకటించింది. ఆ రోజున దేశ వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలో పాటు ప్రైవేట్ కార్యాలయాలను కూడా మూసివేయాలని ఓ ప్రకటన ద్వారా తెలిపింది.

Related posts