వివిధ శాఖల్లో పోస్టుల భర్తీకి సంబంధించిన పరీక్షల షెడ్యూలును ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. వీటిలో గతంలో ప్రకటించిన వివిధ మెయిన్ పరీక్షల తేదీలు మారగా, మరికొన్ని పరీక్షలకు సంబంధించిన తాజా తేదీలను కమిషన్ వెల్లడించింది. వీటిలో గ్రూప్-1 మెయిన్ పరీక్షలతో పాటు.. జూనియర్ లెక్చరర్, పాలిటెక్నిక్ లెక్చరర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, డీఏవో, డిగ్రీ కాలేజ్ లెక్చరర్ మెయిన్ పరీక్షలు ఉన్నాయి.
ఫిబ్రవరిలో గ్రూప్-1, జూనియర్ లెక్చరర్ పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చిలో పాలిటెక్నికల్ లెక్చరర్, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, డిగ్రీ కాలేజ్ లెక్చరర్, టెక్నికల్ అసిస్టెంట్ (జియోఫిజిక్స్), టెక్నికల్ అసిస్టెంట్స్ (హైడ్రాలజీ), వెల్ఫేర్ ఆర్గనైజర్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, టెక్నికల్ అసిస్టెంట్స్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే పరీక్షలను నిర్వహిస్తారు.
అసిస్టెంట్ వెల్ఫేర్ ఆఫీసర్, రాయల్టీ ఇన్స్పెక్టర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, టెక్నికల్ అసిస్టెంట్, అసిస్టెంట్ డైరెక్టర్ (టౌన్ప్లానింగ్), అసిస్టెంట్ కెమిస్ట్, టౌన్ప్లానింగ్ అసిస్టెంట్ పరీక్షలను ఏప్రిల్లో నిర్వహించనున్నారు. మరింత సమాచారం కోసం www.psc.ap.gov.in వెబ్ సైట్ ను క్లిక్ చేయండి.