ఈ నెల 22న మేడ్చల్ ప్రభుత్వ ఐటీఐలో మెగా అప్రెంటీస్ జాబ్మేళాను నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శైలజ ఓ ప్రకటనలో తెలిపారు. వివిధ కంపెనీల్లో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు. 18 ఏండ్లు నిండిన ఇంటర్, ఐటీఐ చదివిన వారు 500 మంది యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ మేళాను తెలంగాణలోని అన్ని జిల్లాల నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. వివరాలకు 7675873394, 9985490144 నంబర్లల్లో సంప్రదించాలని, www.medchal.gov.hi.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు.