telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ సినిమా వార్తలు

సాహో కు .. ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ .. పెంచిన టికెట్ ధరలు..

Saaho

ఏపీ ప్రభుత్వం సాహో సినిమాకు ప్రత్యేక అనుమతులను మంజూరు చేసింది. ప్రభాస్, శ్రద్ధ కపూర్ హీరో, హీరోయిన్లుగా సుజిత్ దర్శకత్వంలో రూపొందిన హై బడ్జెట్ చిత్రం ‘సాహో’ మరో మూడు రోజుల్లో విడుదలకు సిద్ధం అయ్యింది. సినిమా విడుదల అయ్యే అన్ని థియేటర్లలో ఆరు షోలను వేసుకునేందుకు, టికెట్ రేట్లను పెంచుకునేందుకు అంగీకరించింది. ఈ మేరకు ప్రత్యేక జీవో విడుదల అయింది.

నిజానికి బీ, సీ సెంటర్ థియేటర్లలో రోజుకు నాలుగు షోలు వేస్తారు. ఇటీవలి కాలంలో కొన్ని చిత్రాలకు ఐదు షోలకు అనుమతి లభించింది. ఇప్పుడు ఏకంగా ఆరు షోలను ప్రదర్శించేందుకు ప్రభుత్వం అంగీకరించడం గమనార్హం. పెరిగిన టికెట్ రేట్లు ప్రధాన సెంటర్లలో రెండు వారాల పాటు, మిగతా సెంటర్లలో వారం పాటు అమలులో ఉండనున్నాయి. సినిమా భారీ బడ్జెట్ తో నిర్మించినది కావడంతోనే ఇలా ప్రత్యేక అనుమతులు ఇచ్చినట్టు ప్రభుత్వ అధికారులు అంటున్నారు.

Related posts