telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఏపీసీఎం … పులివెందుల పర్యటన ఖరారు…

apcm committee on school fee

ఏపీసీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పులివెందుల పర్యటన ఖరారైంది. గురువారం ఆయన పులివెందుల వెళ్లనున్నారు. ఆ రోజు ఉదయం 9.35గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకొని 9.40గంటలకు అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బయల్దేరి 10.10గంటలకు పులివెందులకు చేరుకుంటారు. 10.35గంటలకు భాకరాపురం చేరుకొని.. అక్కడ మాజీ మంత్రి వైఎస్ వివేకా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

11.10గంటలకు పులివెందు ఆర్అండ్‌బీ గెస్ట్‌హౌస్‌కు చేరుకొని పులివెందుల అభివృద్ధిపై అధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఆ తరువాత మధ్యాహ్నం 1.00గంటకు అక్కడి నుంచి బయలుదేరి అనంతపురం జిల్లా పెనుగొండకు వెళ్లనున్నారు.

Related posts