telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు సామాజిక

విజయవాడ కనకదుర్గమ్మకు .. పట్టువస్త్రాలు సమర్పించనున్న .. ఏపీసీఎం జగన్ ..

jagan attending guntur iftar tomorrow

నేడు ఏపీసీఎం జగన్ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మను దర్శించుకోనున్నారు. రాష్ట్ర మంత్రులు ఓంకారం వద్ద సీఎంకు స్వాగతం పలకనున్నారు. జగన్ ఢిల్లీ పర్యటన నేపథ్యంలో షెడ్యూల్‌లో మార్పు చేశారు. ఇవాళ సాయంత్రం ఇంద్రకీలాద్రికి వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకోనున్నారు. ప్రభుత్వం తరఫున సీఎం హోదాలో కనకదుర్గ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.

శనివారం ఆయన ఢిల్లీ వెళుతున్న నేపథ్యంలో నేడు వస్త్రాలు సమర్పిస్తున్నారు. జగన్ అమ్మవారిని దర్శించుకునే సమయంలో వీఐపీ క్యూలైన్లను నిలిపివేస్తారు. సాధారణ, రూ.100 క్యూలైన్లు మాత్రం నడుస్తాయి. జగన్ పర్యటన సందర్భంగా ఘాట్ రోడ్డుపైకి మధ్యాహ్నం 2.30 గంటల నుంచి ఎలాంటి వాహనాలను అనుమతించరు.

Related posts