telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఆర్టీసీ విలీనం.. ఏపీసీఎం సంచలన నిర్ణయం..

jagan

ఏపీసీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని వివరించడానికి మంత్రి పేర్ని నాని మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఆయన మాట్లాడుతూ, సీఎం జగన్ మానవతా దృక్పథంతో వ్యవహరించి నష్టాలతో కుదేలైన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నారని వివరించారు.

మంత్రి పేర్ని నాని నష్టాలతో ఉన్న ఆర్టీసీని ఆదుకునే క్రమంలో సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసుకుంటామని, అయితే విలీన ప్రక్రియ విధివిధానాల కోసం ఆర్థిక, రవాణాశాఖ మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నిపుణుల సలహాలు, అభిప్రాయాలు కూడా తీసుకోనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ భేటీలో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

Related posts