telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీసీ లకు ఆర్థిక సాయం.. 10వేలు ప్రకటించిన .. ఏపీసీఎం జగన్..

apcm committee on school fee

బీసీలకు లబ్ది చేకూరేలా ఏపీ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రిమండలి భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా నాయీ బ్రాహ్మణ, రజక, టైలర్లకు ఏడాదికి రూ.10 వేలు ఆర్థికసాయం అందించాలని తీర్మానించారు.

బీసీలకు ఆర్థిక సాయం అందించే ఈ ప్రతిపాదనకు మంత్రిమండలిలో ఎవరి నుంచి వ్యతిరేకత వ్యక్తం కాలేదు. నామినేషన్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టులు, సర్వీసు కాంట్రాక్టుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కేటాయించనున్నారు. పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే చెందేలా కొత్త చట్టాన్ని తీసుకురావాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Related posts