telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

2వేల నిరుద్యోగ భృతి.. రెండింతలు చేసిన ఏపీసీఎం.. !

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశానికి యువతీయువకులే వెన్నెముక అని తెలిపారు. యువత తమకు నచ్చిన రంగంలో రాణించి భవిష్యత్తును నిర్మించుకునేందుకు వీలుగా తమ ప్రభుత్వం ‘ముఖ్యమంత్రి యువనేస్తం పథకాన్ని తీసుకొచ్చిందని అన్నారు. ఈ పథకం కింద అందిస్తున్న నిరుద్యోగ భృతిని నేటి నుంచి రెట్టింపు చేసి రూ.2,000 అందిస్తామని ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ట్విట్టర్ లో స్పందించారు.

చంద్రబాబు భారత పైలట్, వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ విడుదల కావడంపై హర్షం వ్యక్తం చేశారు. ‘దేశం కోసం పోరాడుతూ, శత్రు దళాలకు చిక్కి కూడా ఎంతో గంభీరంగా, నిబ్బరంగా పురుషోత్తముడిలా ధైర్యంగా నిలబడ్డ భారతీయ వాయుసేన కెప్టెన్ అభినందన్ సాహసం యువతకు స్ఫూర్తి దాయకం. ఆయన స్వదేశానికి క్షేమంగా చేరుకోవటం ఎంతో ఆనందంగా ఉంది’ అని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Related posts