telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

30శాతం ఈవీఎం లు పనిచేయట్లేదు.. రీపోలింగ్ జరపండి.. : చంద్రబాబు

Chandrababu comments Jagan cases

నేడు ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్ సభ స్థానాలకు గాను పోలింగ్ జరుగుతుంది. దాదాపు 1800 చోట్ల ఈవీఎం లు పోలింగ్ ప్రారంభం నుండే విసిగిస్తుండటంతో ఓటరు అసహనానికి గురవుతున్నాడు. ఎన్నికల అధికారి ఓటు వినియోగించుకోడానికి వెళ్లిన ఈవీఎం స్వయంగా సమస్యగా మారటంతో .. కొత్తవాటిని వాటి స్థానంలో ఏర్పాటు చేస్తున్నారు.

అయితే 30 శాతం వరకు ఈవీఎం లు పనిచేయటం లేదని, అందువలన దాదాపు 3 గంటల సమయం వృధా అయిందని ఏపీసీఎం చంద్రబాబు విమర్శించారు. దీనిపై ఎన్నికల అధికారికి పిర్యాదు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే ఆయా ప్రాంతాలలో రీపోలింగ్ జరపాలని ఆయన విజ్ఞప్తి చేస్తున్నట్టు తెలుస్తుంది.

ఈ విషయంపై ప్రధాన ప్రతిపక్షాలు స్పందించాయి. ఈవీఎం లు పనిచేయడం లేదని ప్రజలను చంద్రబాబు దారిమళ్లించే ప్రయత్నం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

Related posts