ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గుంటూరు జిల్లా బాపట్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడి, టీడీపీ ప్రత్యర్థి మల్యాద్రి శ్రీరామ్ పై ఘన విజయం సాధించిన నందిగం సురేశ్ కు మరో కీలక పదవిని అప్పగించారు . లోక్ సభలో పార్టీ ఉపనేతగా నందిగం సురేష్ పేరును ఖరారు చేశారు.
అలాగే, పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును జగన్ నియమించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు ఓ ప్రకటన ద్వారా మీడియాకు తెలిపారు. గత ఎన్నికల్లో మల్యాద్రి శ్రీరామ్ పై నందిగం సురేశ్ 16,065 ఓట్ల మెజారిటీతో గెలిచారు.