telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

లోక్ సభలో పార్టీ ఉపనేతగా.. నందిగం సురేష్ .. : ఏపీసీఎం

apcm assigned another responsibility to nandigam suresh

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, గుంటూరు జిల్లా బాపట్ల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా నిలబడి, టీడీపీ ప్రత్యర్థి మల్యాద్రి శ్రీరామ్ పై ఘన విజయం సాధించిన నందిగం సురేశ్ కు మరో కీలక పదవిని అప్పగించారు . లోక్ సభలో పార్టీ ఉపనేతగా నందిగం సురేష్ పేరును ఖరారు చేశారు.

అలాగే, పార్లమెంటరీ పార్టీ కోశాధికారిగా నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలును జగన్ నియమించారు. ఈ విషయాన్ని పార్టీ నేతలు ఓ ప్రకటన ద్వారా మీడియాకు తెలిపారు. గత ఎన్నికల్లో మల్యాద్రి శ్రీరామ్‌ పై నందిగం సురేశ్ 16,065 ఓట్ల మెజారిటీతో గెలిచారు.

Related posts