ఏపీసీఎం చంద్రబాబు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేశారు. ఇప్పటికే పలువురు లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థులను ఎంపిక చేసిన ఏపీ సీఎం.. తాజాగా ఈరోజు మరో నాలుగు రిజర్వుడు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు.
* విశాఖలోని పాయకరావు పేట నియోజకవర్గం నుంచి బంగారయ్య
* కొవ్వూరు నుంచి వంగలపూడి అనిత
* తిరువూరు నుంచి మంత్రి జవహర్
* కైకలూరు టికెట్ ను జయమంగళ వెంకటరమణ(అంతకుముందు చింతలపూడి టికెట్ ను కర్రా రాజారావుకు ఇస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు)
మరోవైపు దర్శి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఉగ్ర నరసింహారెడ్డి అయిష్టత వ్యక్తం చేసినట్లు సమాచారం. చంద్రబాబుతో సమావేశమైన నరసింహారెడ్డి తన అభిప్రాయాన్ని ఏపీ సీఎం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది.