దేశంలోని ఆయా రాష్ట్రాల్లో అధికార పార్టీల పనితీరుపై ఫస్ట్ పోస్ట్ ఐపీఎస్ ఓఎస్ నేషనల్ ట్రస్ట్ ఇటీవల ఓ సర్వే చేసింది. ఏపీలో టీడీపీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వాల పనితీరును సగం మంది కంటే ఎక్కువ మంది మెచ్చుకుంటున్నారని సర్వేలో వెల్లడించింది. సర్వే ప్రకారం ఏపీలో టీడీపీ ప్రభుత్వ పనితీరును 75.8 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై 67.6 శాతం సంతృప్తి వ్యక్తం చేశారు. జార్ఖండ్లో ప్రభుత్వ పనితీరుపై 79.8 శాతం మంది సంతృప్తితో ఉన్నారని సర్వేలో తేలింది. కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ పనితీరు బాగుందని 46శాతం మంది మాత్రమే తెలిపారు. తమిళనాడులో అన్నాడీఎంకే ప్రభుత్వం పట్ల కేవలం 21శాతం మందే సంతృప్తితో ఉన్నారని సర్వేలో తేలింది.