ఆంధ్రప్రదేశ్ లో రాజకకీయాల్లో వలసలు ఊపందుకున్నాయి. టీడీపికి చెందిన పలువురు నేతలు బీజేపీ గూటికి చేరుతున్నారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు ఢిల్లీలో బీజేపీ చేరిన సంగతి తెలిసిందే. మొన్న టీడీపీ ఎమ్మెల్సీ అన్నం సతీశ్ కూడా బీజేపీలో చేరిపోయారు. తాజాగా టీడీపికి చెందిన పలువురు నేతలు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు శివరాజ్సింగ్ చౌహాన్ సమక్షంలో పార్టీలో చేరారు.
టీడీపీ అధికార ప్రతినిధి చందు సాంబశివరావు, వైశ్య కార్పొరేషన్ మాజీ చైర్మన్ సిద్ధా వెంకటేశ్వర్రావు, మాజీ మంత్రి పట్నం సుబ్బయ్యతో పాటు వెంకట కోటయ్య, సుధాకర్బాబు పార్టీ కండువా కప్పుకున్నారు. వీరితో పాటు పెద్దకూరపాడు, మాచర్ల నియోజకవర్గాలకు చెందిన నేతలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
23 మంది ఎమ్మెల్యేలే అంటూ జగన్ వ్యాఖ్యానించడం సరికాదు: కోడెల