తెలంగాణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ ఏపీలో వైసీపీ ఏజెంట్గా వ్యవహరిస్తున్నారని వడ్డెర ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దేవళ్ళ మురళీ విమర్శించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ఒక్క పాలకమండలి కూడా ఏర్పాటు చేయని ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలంగాణ ప్రభుత్వమేనని దుయ్యబట్టారు. టీడీపీ హయాంలో బీసీలు ఆర్థికంగా, రాజకీయంగా ఎంతో అభివృద్ధి చెందారని మురళి పేర్కొన్నారు.
ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలైనప్పటికీ మంత్రివర్గం ఏర్పాటు చేసుకోవడం చేతకాని మీరు ఏపీకి వచ్చి నీతులు చెబుతున్నారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో బీసీలను విస్మరించడమే కాకుండా పక్క రాష్ట్రానికి వచ్చి బీసీలపై అనుచితంగా మాట్లాడితే సహించేది లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి2న హైదరాబాద్లో చర్చకు రావాలని తలసానికి సవాల్ విసిరారు. కేవలం మంత్రి పదవి కోసమే తలసాని చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.
మహిళలను వేధించిన వైసీపీ నేతలు దర్జాగా తిరుగుతున్నారు: పంచుమర్తి అనూరాధ