telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

పంచాయితీ ఎన్నికల పై ఏపీ స్పీకర్ కీలక వ్యాఖ్యలు…

మూడవ విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తన స్వగ్రామమైన తొగరాంలో కుటుంబసమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం. తొగరాంలో ఓటువేయడం సంతోషంగా ఉందన్న తమ్మినేని … పంచాయతీ ఎన్నికలు పార్టీలకు అతీతంగా జరుగుతున్నప్పటికీ ప్రజల తీర్పు ఏకపక్షంగా ఉందని అన్నారు . మొదటి , రెండవ విడతల్లో ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచారని…ఇది ప్రో గవర్నమెంట్ తీర్పని అన్నారు . పార్టీ సింబల్ లేకుండానే ప్రజలు తమ అభిప్రాయాన్ని చెప్పేశారని. రేపు పార్టీ సింబల్ పై ఎన్నికలు జరిగితే … ఎంపీటీసీ,జడ్పీటీసీ, మున్సిపాలిటీల్లో కూడా … ఇదే సీన్ రిపీట్ అవుతుందని అందులో ఎలాంటి సందేహం లేదని అన్నారు. సర్పంచ్ గా పోటీచేయడం పెద్దగా ఆసక్తి లేనప్పటికీ కొన్ని అనుకోని పరిస్థితుల్లో తన సతీమణి వాణిని తొగరాం సర్పంచ్ అభ్యర్ధిగా నిలబెట్టాల్సి వచ్చిందన్నారు. ఐతే స్పీకర్ కు తొగరాంలో పనేంటని కొందరు విమర్శలు చేస్తున్నారని తొగరాం నా స్వగ్రామం నాఓటు ఇక్కడే ఉందని ఆయన అన్నారు. తొగరాంలో కాకుండా బొడ్డేపల్లిపేటలో తనకు ఓటుందని కొందరు తప్పుడు ప్రచారం చేస్తుండటాన్ని ఆయన తప్పుబట్టారు. దశాబ్ధాలుగా తాను తీసారీ ఓటు తొగరాంలోనే వేస్తున్నానని గుర్తుచేశారు .

Related posts