telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అనవసర విషయాల పై స్పీకర్ తమ్మినేని అభ్యంతరం

ap speaker tammineni

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. అధికార, విపక్ష నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర ప్రజల సమస్యలను కూడా పట్టించుకోవాలని ప్రతిపక్ష నేత చంద్రబాబు సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అధికార, విపక్షాల మధ్య మటాల యుద్ధం నడిచింది. ప్రశ్నోత్తరాల సమయంలో అనవసర విషయాలను చర్చలోకి లాగడంపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

సభలో చర్చించాల్సిన బిల్లులు చాలా ఉన్నాయని, అందుకు తగ్గట్టు సమయపాలనతో సభను నడపించడానికి ఇరు పక్షాలూ సహకరించాలని కోరారు.బుధవారం జరిగిన బీఏసీ సమావేశంలో కూడా ఈ విషయాన్ని స్పషంగా చెప్పామని గుర్తు చేశారు. ఆ సమావేశానికి ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు వచ్చుంటే బాగుండేదని స్పీకర్ అభిప్రాయపడ్డారు. ప్రతిపక్షం నుంచి అచ్చెన్నాయుడు వచ్చారని, ఆయనకు స్పష్టంగా చెప్పామని స్పీకర్ అన్నారు.

Related posts