telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ వార్తలు

ఏపీ సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి

ఏపీలో ప్రతి రోజు రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే ఏపీలో 9.42 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజా బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 7,224 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,55,455 కు చేరింది. ఇందులో 9,07,598 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా 35,907 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనా కారణంగా 15 మంది మృతి చెందారు.  తాజాగా ఏపీ సచివాలయంలో కరోనాతో మరో ఉద్యోగి మృతి చెందారు. జీఏడీలో సెక్షన్ ఆఫీసరుగా పని చేస్తున్న జి. రవికాంత్ ఇవాళ కరోనాతో మృతి. రెండు రోజుల్లో ఇద్దరు సచివాలయ ఉద్యోగుల మృతి చెందారు. ఉద్యోగుల మృతితో మిగతా సచివాలయ ఉద్యోగుల్లో కరోనా భయాందోళనలు నెలకొన్నాయి. సచివాలయానికి రావడానికి అధికారులు భయపడుతున్నారు.  

Related posts