telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ముస్తాబవుతున్న ఏపీ రాజ్ భవన్.. ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్

rajbhavan ap

ఆంధ్రప్రదేశ్ నూతన గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ హరిచందన్‌‌ను నియమిస్తున్నట్లు రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విజయవాడలోని ఏపీ రాజ్‌భవన్ ముస్తాబవుతుంది. గవర్నర్ భవనాన్ని నూతన హంగులతో తీర్చిదిద్దారు. ఏపీ తొలి గవర్నర్‌గా బిశ్వ భూషణ్‌ హరిచందన్‌‌ ఈ నెల 24న బాధ్యతలు చేపట్టనున్నారు. అందుకు తగ్గట్టు అధికారులు యుద్ధప్రాతిపాధికన ఏర్పాట్లు చేస్తున్నారు. రాజ్ భవన్ లో జరుగుతున్న పనులను, ప్రమాణస్వీకార ఏర్పాట్లను రాష్ట్ర సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, గవర్నర్ కార్యదర్శి ఎంకే మీనా పరిశీలించారు. గతంలో సీఎం క్యాంపు కార్యాలయంగా ఉపయోగించిన భవనాన్ని ఇప్పుడు గవర్నర్ బంగళాగా మార్చబోతున్నారు.

Related posts